ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్‌పై చీటింగ్ కేసు

by Satheesh |   ( Updated:2024-05-17 14:16:22.0  )
ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్‌పై చీటింగ్ కేసు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్‌పై తెలంగాణలో చీటింగ్ కేసు నమోదు అయ్యింది. హైదరాబాద్ జిల్లెలగూడకు చెందిన కిరణ్ కుమార్ అనే వ్యక్తి కేఏ పాల్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రజాశాంతి పార్టీ తరుఫున పోటీ చేసేందుకు ఎల్బీ నగర్ ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని రూ.50 లక్షలు తీసుకుని, టికెట్ ఇవ్వకుండా మోసం చేశాడని పేర్కొన్నారు. ఇందులో రూ.30 లక్షలు ఆన్ లైన్‌లో కేఏ పాల్‌కు చెల్లించానని, మిగిలిన రూ.20 లక్షలు పలు దఫాల్లో ఇచ్చానని తెలిపాడు. కిరణ్ కుమార్ ఫిర్యాదు మేరకు కేఏ పాల్‌పై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, కేఏ పాల్‌పై చీటింగ్ కేసు నమోదు కావడం హాట్ టాపిక్‌గా మారింది.

Read More..

మీరు డిస్ క్వాలిఫై చేయకుంటే.. ఢిల్లీకి వెళ్లి కంప్లైంట్ చేస్తా: రఘునందన్ రావు

Advertisement

Next Story

Most Viewed